Crime News: రెండేళ్ల కిందట రేప్.. తాజాగా గర్భం దాల్చిన బాలిక.. ట్రాప్ చేసింది ఎవరో తెలిస్తే షాక్

|

Sep 28, 2021 | 6:29 PM

ఇంతకంటే వంచన మరేదైనా ఉంటుందా.. ఇంతకంటే దారుణం మరేదైనా ఉంటుందా..?.  మైనర్ బాలిక రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది.

Crime News: రెండేళ్ల కిందట రేప్.. తాజాగా గర్భం దాల్చిన బాలిక.. ట్రాప్ చేసింది ఎవరో తెలిస్తే షాక్
Crime News
Follow us on

ఇంతకంటే వంచన మరేదైనా ఉంటుందా.. ఇంతకంటే దారుణం మరేదైనా ఉంటుందా..?.  మైనర్ బాలిక రెండేళ్ల క్రితం అత్యాచారానికి గురైంది. దీంతో విచారణ నిమిత్తం ఓ పోలీస్ కానిస్టేబుల్ పలుసార్లు ఆమె ఇంటికి వెళ్లాడు. మోరల్ సపోర్ట్ ఇస్తున్నట్లు కలరింగ్ ఇచ్చి ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు నెలల పాటు ఈ దారుణం సాగడంతో బాధితురాలు గర్బం దాల్చింది.  కుమార్తెలో మార్పును గమనించిన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించడంతో విషయం బయటపెట్టింది. ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక పేరెంట్స్ కానిస్టేబుల్‌ను నిలదీశారు. పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన అతడు.. అబార్షన్ చేయించుకోవాలని చెప్పి కొంత మొత్తం( రూ. 35,000) ఇచ్చి వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో కానిస్టేబుల్‌పై కేసు నమోదుచేసిన పోలీసులు..అతడిని అరెస్ట్ చేశారు.

శివరాజ్‌పై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న బాధిత బాలిక మంగళవారం పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చే ఛాన్స్ ఉంది. బాధిత కుటుంబం ఆరోపిస్తోన్న విషయాలు నిజం అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో పూర్తి వాస్తవాలు బయటపడతాయని చెప్పారు.

Also Read:  ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’… వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్

Viral Video: ఈ ఎద్దు చేసిన ఫీట్ చూస్తే నిజంగా మీ మైండ్ బ్లాంక్ అవుతుంది..