మధురైలో వెలిసిన జగన్, విజయ్ బ్యానర్లు.. ఫ్యాన్స్ కోరిక ఏంటంటే..!

| Edited By:

Jun 20, 2020 | 8:33 PM

తమిళనాడులోని మధురై జిల్లాలో కోలీవుడ్ నటుడు విజయ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యానర్లు వెలిశాయి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అతడి బ్యానర్లను పెట్టారు ఫ్యాన్స్.

మధురైలో వెలిసిన జగన్, విజయ్ బ్యానర్లు.. ఫ్యాన్స్ కోరిక ఏంటంటే..!
Follow us on

తమిళనాడులోని మధురై జిల్లాలో కోలీవుడ్ నటుడు విజయ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బ్యానర్లు వెలిశాయి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల అతడి బ్యానర్లను పెట్టారు ఫ్యాన్స్. అందులో కొన్ని చోట్ల విజయ్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు తమ కోరికను బయటపెట్టారు. ఈ క్రమంలో ఆంధ్ర సీఎం జగన్‌లా ప్రజల కష్టాలు తీర్చే ప్రభుత్వాన్ని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లా అవినీతిరహిత పాలనని, కేరళ సీఎం పినరై విజయన్‌లా నిజాయితీతో ప్రభుత్వ పాలన చేయడానికి రావాలంటూ అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే గతంలోనూ విజయ్, జగన్ కలిసి ఉన్న పోస్టర్లు తమిళనాట వైరల్‌గా మారాయి. ఆ వైపు జగన్, ఈ వైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మధ్యలో విజయ్ ఉన్న ఫొటోలను పెట్టిన అభిమానులు.. అతడు రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Read This Story Also: ట్విట్టర్‌కి గుడ్‌బై చెప్పిన స్టార్ హీరోయిన్‌.. కారణం అదేనా..!