ట్విట్టర్కి గుడ్బై చెప్పిన స్టార్ హీరోయిన్.. కారణం అదేనా..!
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ట్విట్టర్కు గుడ్బై చెప్పారు. ఈ మేరకు చివరగా ఓ ట్వీట్ చేశారు సోనాక్షి. అందులో ''నీ చిత్తశుద్ధిని కాపాడుకోవడానికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని నెగిటివిటీకి దూరంగా ఉండటం.
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ట్విట్టర్కు గుడ్బై చెప్పారు. ఈ మేరకు చివరగా ఓ ట్వీట్ చేశారు సోనాక్షి. అందులో ”నీ చిత్తశుద్ధిని కాపాడుకోవడానికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని నెగిటివిటీకి దూరంగా ఉండటం. ముఖ్యంగా ఈ కాలంలో ట్విట్టర్కి దూరంగా ఉండాలి. ఛలో నా అకౌంట్ని డీయాక్టివేట్ చేస్తున్నా. ప్రశాంతంగా ఉండండి” అని కామెంట్ పెట్టారు. దానికి ఓ ఫొటోను కూడా సోనాక్షి పెట్టారు.
అయితే నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ పెద్దలపై విమర్శలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. నెపోటిజంతో సుశాంత్ను బాలీవుడ్ దూరంగా ఉంచిందని, అది తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని కొంతమంది హీరో, హీరోయిన్లు టాలెంట్ లేకున్నా బాలీవుడ్లో నెట్టుకొస్తున్నారని వారు మండిపడుతున్నారు. అంతేకాదు సెలబ్రిటీలను సోషల్ మీడియాలో అన్ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read This Story Also: బండ్ల గణేష్కు కరోనా.. టెన్షన్లో సినీ ప్రముఖులు..!