Today Gold Rates : పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడికి అందనంటూ పైకి దూసుకెళ్తున్నాయి. బంగారం ధర ఈరోజు కూడా రికార్డు స్థాయిలో పైకి ఎగసింది. అమెరికా- చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, కోవిడ్-19 ప్రతికూలతల సహా గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెట్టడంతో మన దేశంలోనూ బంగారం ధరలు పైకి ఎగబాకాయి. హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ ధర పెరిగింది. శనివారం 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.220 పెరిగింది. దీంతో ధర రూ.55,820కు చేరింది. ఇది ఇప్పటివరకు ఆల్టైమ్ గరిష్ట స్థాయి. అదే క్రమంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుదలతో రూ.51,250కు చేరింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా 10వ రోజు కావడం గమనార్హం.
బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.2000 పెరిగింది. దీంతో రేటు రూ.65,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం మెయిన్ రీజన్ అని మార్కెట్ నిపుణులు అభిప్రాయూపడుతున్నారు. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్కు 1.49 శాతం పైకి కదిలింది. దీంతో గోల్డ్ ధర ఔన్స్కు 1971 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర కూడా భారిగానే పెరిగింది. వెండి ధర ఔన్స్కు 5.41 శాతం పెరుగడంతో 24.62 డాలర్లకు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.400 పైకి ఎగసింది. దీంతో రూ.52,200కు చేరింది. అదే క్రమంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.200 పెరుగుదలతో రూ.53,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.2000 పెరుగుదలతో రూ.65,000కు చేరింది. ఇక బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.
Read More : ప్రకాశం జిల్లా : శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా