ప్రకాశం జిల్లా : శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా
ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది ప్రాణాలు విడిచిన ఘటనలో.. డెడ్ బాడీలకు పోస్టుమార్టం కోసం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
prakasam sanitizer deaths : ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పది మంది ప్రాణాలు విడిచిన ఘటనలో.. డెడ్ బాడీలకు పోస్టుమార్టం కోసం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా.. మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృతి చెందారు . మద్యానికి బానిసైనవారు లిక్కర్ దొరక్కపోవడంతో శానిటైజర్ తాగారు. రెండు వేర్వేరుచోట్ల జరిగిన ఘటనల్లో 13 మంది చనిపోయారు. ప్రకాశం జిల్లా కురిచేడులో 10 మంది తనువు చాలించగా.. పామూరులో ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది ప్రాణాలు విడిచారు. మద్యం దొరక్క శానిటైజర్ తాగి వారు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఘటనలపై జిల్లా ఎస్పీ దర్యాప్తు సిద్దార్థ్ కౌశల్ ప్రారంభించారు.
Read More : గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్ : సబ్సిడీ డబ్బులు బంద్ !