ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు!

|

Oct 03, 2020 | 6:17 PM

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,861 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,224 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు!
Follow us on

Coronavirus Positive Cases: ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 72,861 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,224 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. ఇందులో 55,282 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,51,791 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 41 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,941కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 60.21 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 282, చిత్తూరు 827, తూర్పుగోదావరి 824, గుంటూరు 491, కడప 491, కృష్ణా 392, కర్నూలు 225, నెల్లూరు 558, ప్రకాశం 619, శ్రీకాకుళం 175, విశాఖపట్నం 225, విజయనగరం 225, పశ్చిమ గోదావరి 890 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 99,959కు చేరుకోగా.. చిత్తూరులో అత్యధికంగా 670 మంది కరోనాతో మరణించారు.

Also Read:

గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!