షబ్బీర్ అలీపై దాడి కేసు : అప్పుడేమో ప్రధాన నిందితుడు, ఇప్పుడు సంబంధం లేదట

|

Oct 02, 2020 | 4:56 PM

ఫిబ్రవరి 2016 లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల రోజున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీపై దాడి చేసిన కేసు దర్యాప్తులో మీర్ చౌక్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. 

షబ్బీర్ అలీపై దాడి కేసు : అప్పుడేమో ప్రధాన నిందితుడు, ఇప్పుడు సంబంధం లేదట
Follow us on

ఫిబ్రవరి 2016 లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల రోజున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీపై దాడి చేసిన కేసు దర్యాప్తులో మీర్ చౌక్ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.  గురువారం నాంపల్లి కోర్టుకు సమర్పించిన రెండవ చార్జిషీట్ లో ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అతడికి ఈ కేసుతో సంబంధం లేదని తెలిపారు.  కానీ గతంలో ఫైల్ చేసిన చార్జిషీట్ లో మాత్రం అసదుద్దీన్ ఒవైసీని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. విచారణ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.  అందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, వీడియోలు కూడా ఉన్నట్లు వివరించారు. 

జిహెచ్‌ఎంసి ఎన్నికల రోజున, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ…మరికొందరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, కొందరు వ్యక్తులు వారి కారును ఆడ్డుకున్నారు. అందులో కొంతమంది కారు లోపల కూర్చున్న షబ్బీర్ అలీపై దాడి చేశారు. గురువారం ఈ కేసును  విచారించిన జడ్జి అక్టోబర్ 5కు వాయిదా వేశారు. అసదుద్దీన్ గతంలో ఒక ట్వీట్‌ ద్వారా ఈ దాడిలో తన పాత్ర లేదని వెల్లడించారు. తాను దాడి చేసినవారిని అడ్డుకున్నానని పేర్కొన్నారు.

Also Read :

కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !

Nishabdham Movie Review : ‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ