కొండెక్కిన చికెన్ ధరలు

|

Sep 09, 2020 | 2:02 PM

దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ తింటే కరోనా వస్తుందన్న రూమర్స్ సర్కులేట్ అవ్వడంతో.. మాంసం షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు జనాలు.

కొండెక్కిన చికెన్ ధరలు
Follow us on

దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. చికెన్ తింటే కరోనా వస్తుందన్న రూమర్స్ సర్కులేట్ అవ్వడంతో.. మాంసం షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు జనాలు. కొన్ని చోట్ల కోళ్లను ఫ్రీగా ఇస్తామన్నా కూడా ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో ఫౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఐతే రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. కరోనాను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉండే మాంసాహారం తీసుకోవాలని నిపుణులు, డాక్టర్లు ప్రచారం చేశారు. రాజకీయ నాయకులు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా చికెన్ కు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించి కరోనా తెచ్చిన నష్టాలను పూడ్చుకునే పనిలో పడ్డారు వ్యాపారులు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో చికెన్ ధరలు కొండెక్కాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.250 కి ఒక పది రూపాయలు అటు, ఇటుగా ఉంది. అదే క్రమంలో కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి. గతంలో ట్రే గుడ్ల ధర రూ.100 ఉండగా, ఇప్పుడు రూ.150 పలుకుతోంది. బయట షాపుల్లో ఒక్కో గుడ్డు రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు.

 

Also Read : రథం ఘటన: అంతర్వేది ఈవో సస్పెండ్‌