మ‌రో గంటలో పెళ్లన‌గా, వరుడు ఆత్మహత్యాయత్నం

|

Aug 21, 2020 | 8:47 PM

ప్రకాశం జిల్లా దర్శి మండలం దేవవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవ వరుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు.

మ‌రో గంటలో పెళ్లన‌గా,  వరుడు ఆత్మహత్యాయత్నం
Follow us on

ప్రకాశం జిల్లా దర్శి మండలం దేవవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవ వరుడు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మ‌రో గంట‌లోపెళ్లిపీటలు ఎక్కాల్సిన అతను… ఆసుపత్రిలో బెడ్​పైన చికిత్స పొందుతూ  చావుబ్ర‌తుకుల్లో ఉన్నాడు.

దేవవరంలో మరేశ్(23) అనే వ్య‌క్తి వాలంటీర్​గా పని చేస్తున్నాడు. మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో అత‌డికి వివాహాం కుదిర్చారు పెద్దలు. శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తానికి గంట సమయం ఉన్నప్పుడు మ‌రేశ్ బాత్​రూమ్​లోకి వెళ్లి సూసైడ్ చేసుకోడానికి ప్ర‌య‌త్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన దర్శి గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అత‌డి ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇంకా తెలియ‌రాలేదు.

Also Read :

బంగారం ధ‌ర త‌గ్గిందండోయ్, వెండి మాత్రం కొండెక్కింది

ఎస్పీ బాలు కోసం శబరిమలలో ప్ర‌త్యేక పూజ‌లు, సంగీత సమర్పణ