Big Breaking : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్..ఆందోళనలో పార్టీ కార్యకర్తలు

|

Dec 13, 2020 | 6:13 PM

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.

Big Breaking : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్..ఆందోళనలో పార్టీ కార్యకర్తలు
Follow us on

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. “కరోనా వైరస్ ప్రారంభ లక్షణాలను కనిపించిన వెంటనే టెస్టు చేయించుకున్నాను. ఫలితం పాటిటివ్ అని వచ్చింది. వైద్యుల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. నా ఆరోగ్యం బాగుంది. గత కొద్ది రోజులుగా నన్ను సంప్రదించినవారు, దగ్గరగా మెలిగినవారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను” అని జేపీ నడ్డా పేర్కొన్నారు. 

ఇటీవల నడ్డా పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన్ను పలువురు నాయకులు కలిశారు.  కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న క్రమంలో జేపీ నడ్డా కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్లు, ఇటుకలతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రస్తుతం బీజీపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరగుతుంది.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే