Bhargav Ram In Bengaluru: బోయిన్ పల్లి ప్రవీణ్ రావు కిడ్నాప్ వ్యవహారం గంటగంటకు మలుపు తిరుగుతోంది. కేసు విచారణలో భాగంగా.. హైదరాబాద్ హఫీజ్ పేట్లో రూ. కోట్ల విలువైన భూ వివాదం కారణంగా ప్రవీణ్ రావు కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. భార్గవ్ బెంగళూరులో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు సమాచారం సేకరించారు. ఇక ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేయడం కోసం గుంటూరు, కర్నూలు జిల్లాలకు చెందిన 15 మందిని భార్గవ్ రామ్ హైదరాబాద్కు రప్పించాడని పోలీసులు విచారణలో తేలింది. కిడ్నాప్ వ్యవహరం అనంతరం.. పోలీసులకు దొరక్కుండా టోల్ప్లాజాలు లేని సర్వీస్ రోడ్లను ఎంచుకుని బెంగళూరు వైపు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఇక భార్గవ్రామ్కు గతంలోనూ నేరచరిత్ర ఉందని, పలు ఆర్థిక నేరాల్లో ఆయన పాత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నగరంలో పలు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్న భార్గవ్ రామ్.. బాధితులపై భౌతికంగా దాడులకు దిగడానికి కూడా వెనకాడబోడని తమ నివేదికలో తెలిపారు.
Also Read: Elephant attack in chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం.. వ్యక్తికి గాయాలు..