Asaduddin Owaisi: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్లో ఉండిపోయింది. వలస కార్మికులకు రేషన్ సరిగ్గా అందడం లేదని, కార్మికులు, ఉద్యోగులు పూర్తి వేతనాలు అందుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ఇక రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లింలందరూ కూడా ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవాలన్న ఒవైసీ .. సామాజిక దూరం పాటించాల్సిందే అన్నారు. మరోవైపు.. లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో నివసిస్తున్న మాధవి నుండి వచ్చిన అభ్యర్థనకు స్పందిస్తూ.. అసదుద్దీన్ ఒవైసీ దాదాపు 30 ఫ్యామిలీలకు అవసరమైన రేషన్ కిట్లను వెంటనే పంపించాలని పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.
Also Read: అక్కడ షాపింగ్ చేయాలంటే మగాళ్లకే పర్మిషన్.. ఎందుకంటే..!
Also Read: కరోనా కాలంలో.. వేల సంఖ్యలో కోళ్ల మృతి.. కారణమేంటంటే..