ఇంగ్లీషు మాధ్యమానికే ప్రజల ఓటు..

|

Apr 30, 2020 | 8:51 PM

సర్కారీ బడులలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు ఓటేశారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. సుమారు 96.17శాతం మంది తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ జై కొట్టారు. విద్యారంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  విద్యార్థులకు ప్రపంచస్థాయి […]

ఇంగ్లీషు మాధ్యమానికే ప్రజల ఓటు..
Follow us on

సర్కారీ బడులలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు ఓటేశారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించగా.. సుమారు 96.17శాతం మంది తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలంటూ జై కొట్టారు.

విద్యారంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడానికి జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే  విద్యార్థులకు ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందించడానికి, అంతర్జాతీయంగా ఉన్న పోటీ వాతావరణాన్ని ఎదుర్కుని నిలబడేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది. 3 ఆప్షన్లతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను వాలంటీర్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేశారు.

  • ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు
  • తెలుగు మీడియం
  • ఇతర భాషా మీడియం

ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ, తమ అంగీకారం తెలుపుతూ 96.17శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియంను కోరుకున్నవారు 3.05 శాతం మంది. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఈ గణాంకాలు అన్నీ కూడా ఏప్రిల్ 29 వరకు వచ్చిన వాటి ప్రకారం నమోదైనవి.

Read Also:

ఇక నుంచి విమానాల్లోనూ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ టెస్ట్.!

తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!

లాక్ డౌన్ బేఖాతర్.. గుంపులుగా సామూహిక ప్రార్ధనలు..

మే 3 తర్వాత లాక్ డౌన్ 3.0 ఖాయమేనా.?

కరోనా మాటున పాకిస్తాన్ భారీ కుట్ర.. భారత సైన్యానికి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు..

కరోనా కాలంలో జగన్ ప్రభుత్వం మరో సంచలనం..