ఏపీలోని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల వైపు సమాలోచనలు చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం విరమించుకున్న నగదు బదిలీ విధానానాన్ని జగన్ సర్కార్ కీలకంగా పరిశీలిస్తోంది. ఎవరైనా లబ్దిదారు రేషన్ బియ్యం వద్దు అనుకుంటే బదులుగా డబ్బు ఇవ్వాలని భావిస్తోందట. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సును జగన్ సర్కార్ పరిశీలిస్తోందట. త్వరలోనే ఈ పద్దతిని ప్రయోగాత్మకంగా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేజీ బియ్యానికి రూ.25 నుంచి రూ.30 వరకు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Also Read : టీవీ9 ఎఫెక్ట్ : కోవిడ్ మృతుడికి ఎట్టకేలకు అంత్యక్రియలు