టీవీ9 ఎఫెక్ట్ : కోవిడ్ మృతుడికి ఎట్ట‌కేల‌కు అంత్య‌క్రియ‌లు

ప్ర‌భుత్వాలు ఎంత చెప్పినా, మీడియా మొత్తుకున్నా ప్ర‌జ‌ల్లో నో ఛేంజ్. క‌రోనా వ‌చ్చిన‌వారి ప‌ట్ల అదే వివిక్ష‌. వైర‌స్ కార‌ణంగా చ‌నిపోతే అదే బెదురు చూపు.

టీవీ9 ఎఫెక్ట్ : కోవిడ్ మృతుడికి ఎట్ట‌కేల‌కు అంత్య‌క్రియ‌లు
Follow us

|

Updated on: Aug 25, 2020 | 7:27 AM

ప్ర‌భుత్వాలు ఎంత చెప్పినా, మీడియా మొత్తుకున్నా ప్ర‌జ‌ల్లో నో ఛేంజ్. క‌రోనా వ‌చ్చిన‌వారి ప‌ట్ల అదే వివక్ష‌. వైర‌స్ కార‌ణంగా చ‌నిపోతే అదే బెదురు చూపు. క‌రోనా వ్యాప్తి మొద‌టైన‌ప్ప‌టి నుంచి ఇటువంటి ఘ‌ట‌న‌లు అనేకం చూశాం. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా సఖినేటిపల్లి మండ‌లంలో దారుణం చోటుచేసుకుంది.

సోమ‌వారం ఉదయం క‌రోనా వైరస్ కార‌ణంగా రాజులుపూడి స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తి చ‌నిపోయాడు. అత‌డి మృతదేహాన్ని తరలించడానికి అధికారులు, బంధువులు ముందుకు రాలేదు. ఎవరూ స్పందించకపోవడంతో మృతుని భార్య టీవీ9 ఆశ్రయించింది. వెంట‌నే స్పందించిన టీవీ9 ఘ‌ట‌న‌కు సంబంధించి వ‌రుస క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. దీంతో ఎట్ట‌కేల‌కు స్పందించిన రెవిన్యూ అధికారులు, రాత్రికి రాత్రే అంబులెన్స్‌లో మృతదేహాన్ని అమలాపురం త‌ర‌లించి దహనక్రియలు నిర్వ‌హించారు.

Also Read : అవినీతి నిర్మూలన ఎలా..: సీఎం జగన్‌కి ఐఐఎం నివేదిక