CM YS Jagan Comments: కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని.. వారు భయపడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో పొలిటికల్ గెర్రిల్లా వార్ ఫేర్ జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా ఆలయాలను రక్షించుకునేందుకు 26 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు.
Also Read:
వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!
జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..
కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్