Akshay Kumar Tweet: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయంపై స్పందించారు. ”సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. నిజం బయటికి వస్తుందని ఆశిస్తున్నా” అని అక్షయ్ ట్వీట్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై చర్చ జరుగుతున్న వేళ.. అక్షయ్ ఈ మేరకు ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.
SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail ?? #Prayers
— Akshay Kumar (@akshaykumar) August 19, 2020
కాగా, సుప్రీం కోర్టు తీర్పుపై ఇప్పటికే బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పందించిన సంగతి తెలిసిందే. ”ఇప్పటికైనా మా వైఖరిని కోర్టు సమర్ధించిందని ట్వీట్ చేశారు. మా రాష్ట్రంలో దాఖలైన ఎఫ్ఐఆర్ ఆధారంగా సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయాలన్న కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read:
తెలంగాణలో విస్తరిస్తున్న కొత్త వైరస్.. ఆందోళనలో రైతులు..