‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని తిరువత్తర్​ జిల్లాలో జరిగింది.

'పబ్​జీ' ప్రేమాయణం, చివరకు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 25, 2020 | 11:12 AM

ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయింది ఓ యువతి. ఈ ఘటన తమిళనాడులోని తిరువత్తర్​ జిల్లాలో జరిగింది. యువతి పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ పబ్​జీ ప్రేమ వ్యవహారం బయటపడింది.

కరోనా లాక్​డౌన్​ సమయంలో.. బబిష అనే 20ఏళ్ల యువతి పబ్​జీ ఆడటం స్టార్ట్ చేసింది. ఆటలో భాగంగా అజిత్​ ప్రిన్స్​(24)ను ఆన్​లైన్​లో కలుసుకుంది. క్రమక్రమంగా ఇరువురి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. కొద్ది రోజులకు అది ప్రేమగా మారింది.ఈ నెల 19న అజిత్​ను పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది బబిష. కూతురు కనపడకపోవడం వల్ల తిరువత్తర్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు బబిష-అజిత్​ కనపడ్డారు. అనంతరం ఈ ప్రేమ జంట పోలీసు స్టేషన్​లో లొంగిపోయింది. అయితే బబిష ప్రేమను ఆమె పేరెంట్స్ అంగీకరించలేదు. అయినప్పటికీ.. వారు పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. దీంతో పోలీసుల సమక్షంలో దగ్గర్లోని దేవాలయంలో వారి వివాహం జరిగింది.