కోహ్లీ, రోహిత్‌లను దాటేసిన గబ్బర్.. ఐపీఎల్‌లో రేర్ ఫీట్.!

|

Oct 16, 2020 | 6:22 PM

భారత జట్టు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(39) సాధించిన రెండో ఆటగాడిగా..

కోహ్లీ, రోహిత్‌లను దాటేసిన గబ్బర్.. ఐపీఎల్‌లో రేర్ ఫీట్.!
Follow us on

భారత జట్టు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(39) సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి గబ్బర్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు 38 అర్ధ సెంచరీలతో మూడో స్థానంలో ఉండగా.. ధావన్‌ది రెండో స్థానం. (IPL 2020)

ఈ జాబితాలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(46 హాఫ్ సెంచరీలతో) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో 167 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్ 33.59 సగటుతో 4,837 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న గబ్బర్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.