‘సూపర్’ విక్టరీ.. 3-0 తో సిరీస్ స్వీప్ చేసిన భారత్

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ 20 లో సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. దీంతో 3-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.  న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత్ సొంతమైంది. న్యూజిలాండ్, టీమిండియా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 నిర్ణిత ఓవర్లలో డ్రా అయ్యింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. ఇరు జట్ల […]

'సూపర్' విక్టరీ.. 3-0 తో సిరీస్ స్వీప్ చేసిన భారత్
Follow us

| Edited By:

Updated on: Jan 29, 2020 | 5:06 PM

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టీ 20 లో సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించింది. దీంతో 3-0 తో సిరీస్ కైవసం చేసుకుంది.  న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత్ సొంతమైంది. న్యూజిలాండ్, టీమిండియా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 నిర్ణిత ఓవర్లలో డ్రా అయ్యింది. 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగుల చేసింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లారు.  భారత బౌలర్లలో ఠాకూర్, షమి రెండేసి వికెట్లు తీసుకోగా.. చాహల్, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.

ఐదు మ్యాచుల సిరీస్‌ను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. 3-0 తో సిరీస్ కైవసం చేసుకుంది. సూపర్ ఓవర్‌లో కివీస్ తరఫున కెప్టెన్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్ బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరూ కలిసి రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17పరుగులు చేశారు. దీంతో 18పరుగుల లక్ష్యంతో భారత్ తరపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బరిలోకి దిగారు. తొలి రెండు బంతుల్లో మూడు పరుగులే రావడంతో భారత్ విజయంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తర్వాతి బంతికే రాహుల్ ఫోర్ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీయడంతో రోహిత్ స్ట్రయికింగ్‌కు వచ్చాడు. తాను ఎదుర్కొన్న రెండు బంతులనూ సిక్సర్లుగా మలిచిన రోహిత్ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.

Latest Articles