పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్.. ‘india vs england’ మ్యాచ్.. ఇంట్రెస్టింగ్‏గా చూసిన అతిధులు.. ఎక్కడంటే..

|

Feb 10, 2021 | 8:26 AM

ఈ మధ్య కాలంలో పెళ్లి మండపంలో ఎల్ఈడీ టీవీలను అమరుస్తున్న సంగతి తెలిసిందే. అందులో మండపంపై జరుగుతున్న పెళ్ళి తతంగాన్ని దూరంగా కూర్చున్న

పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్.. india vs england మ్యాచ్.. ఇంట్రెస్టింగ్‏గా చూసిన అతిధులు.. ఎక్కడంటే..
Follow us on

ఈ మధ్య కాలంలో పెళ్లి మండపంలో ఎల్ఈడీ టీవీలను అమరుస్తున్న సంగతి తెలిసిందే. అందులో మండపంపై జరుగుతున్న పెళ్ళి తతంగాన్ని దూరంగా కూర్చున్న వాళ్లు కూడా చూసేందుకు వీలుగా ఈ ఎల్ఈడీ టీవీలను అమరుస్తారు. అయితే ఈ ఎల్ఈడీ టీవీలలో పెళ్లి కార్యక్రమానికి బదులుగా వచ్చిన అతిధులందరూ.. క్రికెట్ మ్యాచ్ లైవ్ చూస్తూ ఉండిపోయారు. ఓ వైపు పెళ్లి జరుగుతుంటే అదేం పట్టనట్లుగా అందురూ క్రికెట్ చూడడంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కరోనా వైరస్ ప్రభావంతో శుభకార్యాలకు అథిధులు రావడం సంఖ్య మరింత తగ్గిపోయింది. ఇక పెళ్లిలకు వచ్చే అతిధుల సంఖ్య కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో పెళ్లికి రావడం మరింత కష్టం. కోవిడ్ పరిస్థితి తర్వాత జరుగుతున్న India vs england ఫస్ట్ టెస్ట్ ఇది. అందుకే ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఈ మ్యాచ్‏ను చూస్తున్నారు. అయితే ఇక్కడ ఓ కుటుంబం విచిత్రంగా ఆలోచించింది. పెళ్లికి వచ్చిన అతిధులు పెళ్లి చూసినా చూడకపోయినా.. క్రికెట్ మ్యాచ్ మాత్రం మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఆ కుటుంబ సభ్యులు పెళ్లి మండపంలో ఎల్ఈడీ టీవీలను పెట్టించారు. అందులో క్రికెట్ మ్యాచ్ లైవ్ వచ్చేలా చూసుకున్నారు. ఇక పెళ్ళికి వచ్చిన అతిధులు అటు పెళ్లి తతంగం జరుగుతున్న అదేం పట్టనట్లుగా క్రికెట్ లైవ్ చూడడంలో ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అక్షయ్ నటరాజ్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఇద్దరు చెన్నై కుర్రాళ్ళు బ్యాటింగ్ చేస్తున్న చెన్నై టెస్ట్ ఇది. దీన్ని ఎలా వదిలిపెడతాం ? హ్యాప్పీ మ్యారీడ్ లైఫ్ ద ఆనంద్ అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: INd Vs AUS Test Match: ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. మ్యాచ్‌కు అంతరాయంగా మారిన వర్షం..