100 కోట్ల
వ్యాక్సినేషన్
కోవిడ్ నుంచి దేశాన్ని పూర్తిగా రక్షించేందుకు భారత్ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోడీ ప్రభుత్వ నేతృత్వంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటివరకు పంపిణీచేశారు. 2021 మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారిందరికీ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
గ్రాఫిక్స్ ఎలా చూడాలంటే..?ఏ రాష్ట్రంలో ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డేటా ఈ సర్కిల్లో ఉంది. ఏ రాష్ట్రం ఎక్కువ టీకాలు వేస్తుందో.. ఆ రాష్ట్రం సర్కిల్ పెద్దగా ఉంటుంది. ఈ సర్కిల్ లోపల మరో రెండు చిన్న సర్కిళ్లు కూడా ఉన్నాయి.. దానిపై క్లిక్ చేస్తే మొదటి, రెండవ డోసుల తీసుకున్న వారి డేటాను చూడవచ్చు.
అక్టోబర్ 21, 2021
భారతదేశంలోని 100 కోట్ల మంది ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఇందులో మొదటి డోస్ తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రెండవ డోస్ తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. వ్యాక్సినేషన్తోనే కరోనాపై పోరాడవచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కాగా.. ఈ కింద ఇవ్వబడిన గ్రాఫ్ ద్వారా.. మీరు దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం అమలు గురించి తెలుసుకోవచ్చు. 2021 చివరి నాటికి 18ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ లైన్ చార్ట్లో కరోనా కేసుల సంఖ్య, ఇప్పటివరకు ఇచ్చిన టీకా మోతాదుల గురించి సమాచారం ఉంటుంది. మీరు మొదటి డ్రాప్ డౌన్ చేస్తే.. రాష్ట్రానికి సంబంధించిన డేటా చూడవచ్చు. రెండవదానిపై క్లిక్ చేస్తే జిల్లాలను కూడా ఎంచుకోవచ్చు.దీని తరువాత రెండింటి డేటా కూడా మీకు కనిపిస్తుంది.
ఈ గ్రాఫ్ ప్రకారం.. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా రోగుల సంఖ్య మే చివరి వారంలో తగ్గడం ప్రారంభమైంది. అప్పటినుంచి కూడా టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతూనే ఉంది. మే 01 నుంచి 18ఏళ్లు పైబడినవారందరికీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు దేశంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు.
దీంతోపాటు కింద ఇచ్చిన డేటాలో ఇతర దేశాల నివేదికను కూడా చూడవచ్చు. ఈ డేటా ప్రతి 100 మందికి ఇచ్చిన మోతాదులపై ఆధారపడి ఉంటుంది.