తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం.. నటి అనుమానాస్పద మృతి

| Edited By:

Apr 09, 2020 | 2:08 PM

తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం.. నటి అనుమానాస్పద మృతి
Follow us on

తెలుగు టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది. టీవీ యాంకర్, సీరియల్ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లారెడ్డి గూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శాంతి ఎలా చనిపోయిందనేదానిపై చుటుపక్కల వారిని విచారిస్తున్నారు. అసలు ఆమెది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్న కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా వైజాగ్‌కు చెందిన శాంతి.. పలు సీరియల్స్‌లో నటించారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ ఎఫెక్ట్: ఎర్రగడ్డకు పెరుగుతోన్న మందుబాబుల సంఖ్య..!