చాలా మంది సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు ప్రజంట్ బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. ఈ వరుసలో రష్మిక మందన్న, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ సహా చాలా మంది స్టార్స్ ఉన్నారు. కన్నడ నటుడు యష్ కూడా బాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదించాడు. దీంతో చాలామంది దక్షిణాది తారలు ముంబైలో ఇళ్లు కొన్నారు.
అల్లు అర్జున్ : ‘పుష్ప’ సినిమాతో బాలీవుడ్లో తనదైన ముద్రవేశాడు నటుడు అల్లు అర్జున్. ఆయన నటించిన ‘పుష్ప 2’ చిత్రం హిందీలోనూ విడుదలవుతోంది. ఈ క్రమంలో బన్నీ ముంబైలో ఇల్లు కొన్నాడు. ముంబైకి వెళ్తే.. ఈ ఇంట్లోనే ఉంటారు.
సూర్య: నటుడు సూర్య దంపతులకు ముంబైలో ఒక అపార్ట్మెంట్ఉంది. సూర్య పిల్లలు ముంబైలో చదువుతున్నారు. అందుకే ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. అలానే నటి జ్యోతిక బాలీవుడ్లో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్: నటుడు రామ్ చరణ్కు ముంబైలో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఈ ఇంటి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. RRR తర్వాత చరణ్ ఇమేజ్ ఓ రేంజ్కు చేరింది. దీంతో అతను చేసే సినిమాలు ప్యాన్ ఇండియా వైజ్ రిలీజ్ అవుతున్నాయి.
తమన్నా భాటియా: నటి తమన్నా భాటియా సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉన్నారు. విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. కాగా తమన్నాకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు ఉంది.
పూజా హెగ్డే: హిందీ చిత్రసీమలో నటి పూజా హెగ్డేకు మంచి డిమాండ్ ఉంది. చాలా హిందీ సినిమాల్లో నటించింది. ఆమెకు ముంబైలో ఇల్లు ఉంది. సినిమా పనుల నిమిత్తం ముంబై వెళ్లినప్పుడు అక్కడే ఉంటుంది.
రష్మిక మందన్న: నటి రష్మిక మందన్న సౌత్ ఇండియాతో పాటు హిందీలోనూ బిజీగా ఉంది. అక్కడ ఇల్లు కొనుగోలు చేసింది. ముంబైలోనే కాకుండా బెంగళూరు, హైదరాబాద్లో రష్మికకు ఇళ్లు ఉన్నాయి.
కాజల్ అగర్వాల్: నటి కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన కొడుకు సంరక్షణలో నిమగ్నమై ఉంది. పెళ్లి తర్వాత ముంబైలో సెటిల్ అయ్యింది. ముంబైలో ఆమెకు అందమైన ఇల్లు ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.