పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడిందని తెలియగానే కోట్లాదిమంది భారతీయుల మనసులు ముక్కలయ్యాయి. బుధవారం (ఆగస్టు 07) జరిగే ఫైనల్ పోరులో బంగారు పతకం సాధిస్తుందని ఎదురు చూసిన అభిమానులు ఈ న్యూస్ తెలియగానే షాక్ లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి నెటిజన్ల వరకు వినేశ్ కు అందరూ అండగా నిలుస్తున్నారు. ఆమెకు ధైర్యం చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కూడా వినేశ్ ఫొగాట్ కు సపోర్టుగా పోస్టులు షేర్ చేస్తున్నారు. భారత్ స్టార్ రెజ్లర్ పై అనర్హత వేటు పడడంపై సమంత తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ‘ కొన్ని సమయాల్లో, ఎంతగానో పోరాడే వ్యక్తులు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. ఇన్ని కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే మీ అద్భుతమైన ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ కష్టసుఖాల్లో మేము ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాం’ అని సమంత పోస్ట్ పెట్టింది.
‘మా మనసులు ముక్కలయ్యే వార్త ఇది. కానీ వినేశ్.. నువ్వు ఇప్పటికే నీ ప్రతిభతో స్వర్ణ పతకాన్ని మించిన పేరు సాధించావ్’ అంటూ తాప్సీ రాసుకొచ్చింది. ఇక సోనాక్షి సిన్హా స్పందిస్తూ.. ‘ ఇలాంటి కష్ట సమయంలో మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలయదు. మీరు ప్రస్తుతం ఎంతటి బాధలో కూరుకుపోయారో అని ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. కానీ మీరు ఎప్పటికీ ఛాంపియన్గా ఉంటారు అని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను’ అని పోస్ట్ పెట్టింది.
You have won our hearts ❤️❤️❤️❤️@Phogat_Vinesh … what you have done and stood for … will inspire generations to come 🙏🙏🙏 #NaariShakti #justasking #Vineshphogat https://t.co/P3xrD5ad5h
— Prakash Raj (@prakashraaj) August 7, 2024
వీరితో పాటు ప్రకాశ్ రాజ్, ఫర్హాన్ అక్తర్, స్వర భాస్కర్, హేమ మాలినీ, విక్కీ కౌశల్, జోయా అక్తర్ తదితరులు వినేశ్ ఫొగాట్ అనర్హత విషయంలో తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.