Ram Charan: అప్పుడు తారక్, ఇప్పుడు చరణ్.. బుచ్చిబాబు సినిమాకోసం ఆ లుక్‌లో మెగాపవర్ స్టార్

|

Jun 21, 2024 | 7:05 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బడా హీరోలు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఈ ఇద్దరినీ కలిపి రాజమౌళి ఎలా చూపిస్తారా అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ హీరో ఎక్కువ.. ఈ హీరో తక్కువ అనే భావన కలగకుండా సినిమా రూపొందించి మెప్పించాడు జక్కన్న. ఈ సంచలన సినిమా తర్వాత ఇద్దరు హీరోలు బిజీగా మారిపోయారు. తారక్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. రెండు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan: అప్పుడు తారక్, ఇప్పుడు చరణ్.. బుచ్చిబాబు సినిమాకోసం ఆ లుక్‌లో మెగాపవర్ స్టార్
Ram Charan
Follow us on

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బడా హీరోలు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్. ఈ ఇద్దరినీ కలిపి రాజమౌళి ఎలా చూపిస్తారా అని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఆ హీరో ఎక్కువ.. ఈ హీరో తక్కువ అనే భావన కలగకుండా సినిమా రూపొందించి మెప్పించాడు జక్కన్న. ఈ సంచలన సినిమా తర్వాత ఇద్దరు హీరోలు బిజీగా మారిపోయారు. తారక్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అటు చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. రెండు సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఖాతాలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత బుచ్చిబాబు సినిమామొదలుపెట్టనున్నాడు చరణ్.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ప్రకటించలేదు. RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాబీ డియోల్ పేరు చర్చిస్తున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆయన పాత్రకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ దాదాపు పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంతలో, రామ్ చరణ్ తన నెక్స్ట్  సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. ఇది స్పోర్ట్స్ డ్రామా చిత్రం అని అంటున్నారు. చరణ్ ఈ సినిమాలో క్రీడాకారుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర నేపధ్యంలో ఈ సినిమా రూపొందుతోందని అంటున్నారు. వృద్ధి సినిమా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ గిరిజన ఆటగాడి పాత్రలో కనిపించనున్నారని టాక్. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా కనిపిస్తుందని అంటున్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆస్ట్రేలియాలో శిక్షణ తీసుకోనున్నారు చరణ్. అదేవిధంగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీని 2025లో థియేటర్లలోకి తీసుకురానున్నారు.జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లో గిరిజన యువకుడి పాత్రను పోషించాడు. ఇప్పుడు చరణ్ కూడా అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.