Pushpa 2: అల్లు అర్జున్‌కు పోటీగా ఆ యంగ్ హీరోస్‌.. ‘పుష్ఫ 2’ రిలీజ్‌రోజే థియేటర్లలోకి ఆ ఆసక్తికర సినిమాలు

|

Feb 10, 2024 | 3:22 PM

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుష్ప పార్ట్‌ 1 పాన్‌ ఇండియా రేంజ్ లో హిట్‌ కావడం, ఇదే సినిమాకు బన్నీకి జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం రావడంతో పుష్ప2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి

Pushpa 2: అల్లు అర్జున్‌కు పోటీగా ఆ యంగ్ హీరోస్‌.. పుష్ఫ 2 రిలీజ్‌రోజే థియేటర్లలోకి ఆ ఆసక్తికర సినిమాలు
Arjun's Pushpa
Follow us on

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పుష్ప పార్ట్‌ 1 పాన్‌ ఇండియా రేంజ్ లో హిట్‌ కావడం, ఇదే సినిమాకు బన్నీకి జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం రావడంతో పుష్ప2 సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, సునీల్‌, అనసూయ, ఫహద్ ఫాసిల్ , కన్నడ డాలీ ధనంజయ్ తదితరులు నటించారు. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ఫ 2 సినిమా విడుదల కానుంది. అయితే ఇదే తేదీపై మరికొన్ని ఆసక్తికర సినిమాలు ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. సాధారంగా భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు పండుగలు లేదా ప్రత్యేక రోజులలో చిత్రాలను విడుదల చేయడానికి ఇష్టపడతారు. అలా ఈసారి సంక్రాంతి సందర్బంగా మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ లాంటి భారీ బడ్జెట్ సినిమా సరసన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని అంటున్నారు.

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘సరిపోదా శనివారం’, అక్కినేని నాగ చైతన్య నటించిన ‘థండేల్‌’ సినిమాలు కూడా ఆగస్ట్ 15 న విడుదలయ్యే అవకాశం ఉందని వర్గాల సమాచారం. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. మొత్తానికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా అభిమానులకు పండగే. కొన్ని నివేదికల ప్రకారం ‘పుష్ప 2’ ముందుకు వెళితేనే ఈ సినిమాలు విడుదలవుతాయి.నాని ‘సరిపోదా శనివారం’ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంక్ అరుల్ మోహన్, ఎస్జే సూర్య తదితరులు నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తోంది. మరోవైపు తమ సినిమా రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేసే ఆలోచనలో లేదని పుష్ప2 మేకర్స్‌ అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ కోసం టీమ్ జపాన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నాని సరిపోదా శనివారం

నాగచైతన్య థండేల్ కూడా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి