లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లైంది. నయన్..విఘ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసి విధానంలో అక్టోబర్ 9న కవల పిల్లలు తల్లిదండ్రులుగా మారారు. పండింటి మగబిడ్డలకు జన్మించినట్లుగా తన పిల్లలు పాదాల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ జంట. అంతేకాదు..అప్పుడే వారిద్దరికి ఉయిర్.. ఉలగం అనే పేర్లు కూడా పెట్టినట్లు తెలిపారు. అయితే సరోగసి విధానంతో పిల్లలు జన్మనివ్వడంపై ఈ దంపతులను కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నయన్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” నయన్.. వికీకి చాలా చాలా శుభాకాంక్షలు.. పేరెంట్స్ క్లబ్లోకి మీకు ఆహ్వానం. కచ్చితంగా జీవితంలో ఇది ఉత్తమ దశ అవుతుంది. ఉయిర్, ఉలగమ్ కు నా నుంచి ఎంతో ప్రేమ, దీవెనలు. ” అంటూ పోస్ట్ చేసింది కాజల్.
దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన్. అంతేకాదు.. ఇండస్ట్రీలోనే హీరోలతో సమానంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో 2015 నుంచి ప్రేమలో ఉన్నారు నయన్. ఏడాది జూన్ 9న వీరిద్దరు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.