Ram Charan: ఆ సినిమా కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..

|

Jun 18, 2024 | 9:50 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 250 కోట్ల బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా రూపొందుతుంది, కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లకు చేరుకుంది.అలాగే మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా పనులను పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Ram Charan: ఆ సినిమా కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్..
Ram Charan
Follow us on

ఆర్‌ఆర్‌ఆర్ సక్సెస్ తర్వాత ఎక్కడ చూసినా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చారు. దర్శకదీరుడు రాజమౌళి ప్రతిభ. ఈ ఇద్దరి నటన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశారు.  ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా రాబోతుండగా.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 250 కోట్ల బడ్జెట్‌తో గేమ్ ఛేంజర్ సినిమా రూపొందుతుంది, కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 450 కోట్లకు చేరుకుంది.అలాగే మూవీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా పనులను పూర్తి చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి 2 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తుంది, ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా పనులను ప్రారంభించనున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ16. ఇది స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడట.  ఇందుకోసం రామ్ చరణ్ ఆస్ట్రేలియా వెళ్లనున్నాడట, అందుకు కనీసం రెండు నెలల సమయంతీసుకోనున్నాడని తెలుస్తోంది.

రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని అత్యుత్తమ శిక్షకులతో శిక్షణ తీసుకోనున్నారు. బాడీ బిల్డింగ్ తో పాటు తన పాత్ర కోసం మేకోవర్ కూడా చేస్తాడని అంటున్నారు. అలాగే ఫైనల్ లుక్ కూడా లాక్ అయిందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సమాచారం. దీని కోసం చాలా ఓ గ్రామం సెట్ నిర్మించనున్నారట. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం 2025 చివరిలో థియేటర్లలోకి రానుంది. అటు జాన్వీ కపూర్  ‘దేవరా’ షూటింగ్‌లో బిజీగా ఉంది. త్వరలో జాన్వీ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య రొమాంటిక్ పాటను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించబోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.