Lakshmi Manchu: కరోనాను జయించిన మంచు వారి అమ్మాయి.. నెగిటివ్ వచ్చిందంటూ గుడ్ న్యూస్ చెప్పిన లక్ష్మీ మంచు..

|

Jan 13, 2022 | 8:26 PM

కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది.. సామాన్యులాఉంచి సెలబ్రెటీ ల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే..

Lakshmi Manchu: కరోనాను జయించిన మంచు వారి అమ్మాయి.. నెగిటివ్ వచ్చిందంటూ గుడ్ న్యూస్ చెప్పిన లక్ష్మీ మంచు..
Follow us on

కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది.. సామాన్యులాఉంచి సెలబ్రెటీ ల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినిమా తారలు వరుసగా కరోనా బారిన  పడటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో పలువురు తారలు కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే టాలివుడ్ లో మహేష్ బాబు, కీర్తిసురేష్, రాజేంద్ర ప్రసాద్, త్రిష,  నవీన్ పోలిశెట్టి, బండ్లగణేష్, తమన్ ఇలా పలువురు కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు మంచు వారి అమ్మాయి లక్ష్మీ ప్రసన్న కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ప్రకటించింది. ఇక తాజాగా ఆమె కరోనా జయించింది. ఈ విషయాన్ని కూడా మంచు లక్ష్మినే స్వయంగా ప్రకటించపరు.

మంచు లక్ష్మి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. ‘హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడీ. ఐయాం నెగెటివ్’ అని ఆమె తెలిపారు. అంతేకాదు లక్ష్మీ, ఆమె కూతురు ఇద్దరూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం  ఈ వీడియోలో చూడొచ్చు. ఇక మంచు లక్ష్మి హీరోయిన్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రోలో మెప్పిస్తునే.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మీ కి నెగిటివ్ అని తేలడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raviteja: రామారావుతో కాలు కదపనున్న బాలీవుడ్ శృంగార తార.. సాంగ్ అద్భుతంగా వచ్చిందంటోన్న దర్శక నిర్మాతలు..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..

Mohan Babu: గుడ్‏న్యూస్ చెప్పిన మోహన్ బాబు.. శ్రీ విద్యానికేతన్ కాలేజ్‏కీ యూనివర్సిటీ హోదా..