సుకుమార్- ధరమ్‌ తేజ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే!

| Edited By:

Aug 28, 2020 | 1:18 PM

మొన్నటివరకు కమర్షియల్ కథలవైపే మొగ్గుచూపిన సాయి ధరమ్ తేజ్‌, చిత్రలహరి నుంచి పంథాను మార్చారు. ఓ వైపు కమర్షియల్, మరోవైపు వైవిధ్య చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు

సుకుమార్- ధరమ్‌ తేజ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే!
Follow us on

Sukumar-Sai Dharam Tej Movie: మొన్నటివరకు కమర్షియల్ కథలవైపే మొగ్గుచూపిన సాయి ధరమ్ తేజ్‌, చిత్రలహరి నుంచి పంథాను మార్చారు. ఓ వైపు కమర్షియల్, మరోవైపు వైవిధ్య చిత్రాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లెక్కల మాస్టర్ సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ థ్రిల్లర్‌ మూవీకి ధరమ్‌ తేజ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆ మధ్యన వచ్చింది.

కొత్త దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్‌ప్లే కూడా అందిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ గురించి కార్తీక్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుకుమార్ సర్‌కి ఈ కథను చెప్పినప్పుడు ఆయనకు చాలా నచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఒక సంవత్సరం ఆగమని చెప్పారు. కానీ ఆ తరువాత తానే నిర్మిస్తానంటూ చెప్పి, స్క్రీప్‌ ప్లే కూడా రాశారు అని కార్తీక్ తెలిపారు. ఇక 70లలో ఉండే మూఢ నమ్మకాల ఆధారంగా ఈ మూవీ ఉంటుందని., కొత్తగా దీన్ని తెరకెక్కించబోతున్నామని కార్తీక్ వివరించారు. కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read More:

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్

అందుకే కాల్పులు జరిగాయి.. నార్సింగి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు