ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా.. కన్ఫర్మ్ చేసిన ప్రముఖ నటి..!

| Edited By:

May 14, 2020 | 4:04 PM

'జిల్'‌ ఫేమ్ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రభాస్‌ మూవీలో నటిస్తున్నా.. కన్ఫర్మ్ చేసిన ప్రముఖ నటి..!
Follow us on

‘జిల్’‌ ఫేమ్ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ 20వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తైంది. కాగా రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారని ఆ మధ్యన వార్తలు రాగా.. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చేశారు ఆమె. ఇందులో నటిస్తున్నట్లు భాగ్యశ్రీ తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన భాగ్యశ్రీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రారంభం అవ్వకముందు ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యా. ఇందులో నా పాత్ర చాలా బావుంటుంది అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఇంకా కొన్ని కథలను వింటున్నానని వెల్లడించారు. కాగా మైనే ప్యార్‌ కియా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ఆ సినిమాతో మంచి పేరును సంపాదించుకున్నారు. కానీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో మాత్రమే నటించిన ఈ నటి.. ఒకానొక సమయంలో సినిమాలకు దూరమయ్యారు. గతేడాది కన్నడ చిత్రం సీతారామ కల్యాణతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో అడవి శేషు హీరోగా నటిస్తోన్న 2 స్టేట్స్‌ రీమేక్‌లోనూ భానుశ్రీ నటిస్తున్నారు.

Read This Story Also: మరో 30కి.మీలలో ఇల్లు ఉందనగా.. ‘కరోనా’తో వలస కూలీ మృతి..!