కరోనా ఎఫెక్ట్.. ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆలోచిస్తోన్న దిల్ రాజు

| Edited By:

Apr 02, 2020 | 5:32 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

కరోనా ఎఫెక్ట్.. ఆర్ఆర్ఆర్‌ గురించి ఆలోచిస్తోన్న దిల్ రాజు
Follow us on

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారట. రాజమౌళిపై నమ్మకం.. దానికి తోడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరు కలిసి నటిస్తోన్న మొదటి చిత్రం కావడంతో.. దాదాపు రూ.75కోట్లకు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్నారట దిల్ రాజు.

కానీ కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాలపై బాగా పడింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయంలోనూ ఈ ప్రభావం కచ్చితంగా ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నారట. అందుకే ఆర్ఆర్ఆర్ డీల్‌ను పునరాలోచించాలని ఈ బడా నిర్మాత అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్యతో చర్చించాలన్న ఆలోచనలో దిల్ రాజు ఉన్నారట. ఒకవేళ కుదరకపోతే.. ఈ హక్కులను వేరే వారికి ఇస్తామంటే వదిలేద్దామనే ఆలోచనలో కూడా దిల్ రాజు ఉన్నట్లు ఫిలింనగర్‌లో భోగట్టా.

Read This Story Also: సెట్‌ అయిన క్రేజీ కాంబో.. అట్లీ దర్శకత్వంలో షారూక్..!