సెట్ అయిన క్రేజీ కాంబో.. అట్లీ దర్శకత్వంలో షారూక్..!
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్టైంది. రాజా రాణి, తెరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో వరుస హిట్లను సొంతం చేసుకొని కోలీవుడ్లో టాప్ దర్శకుడిగా పేరొందిన అట్లీ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది.
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబో సెట్టైంది. రాజా రాణి, తెరి, మెర్సల్, బిగిల్ చిత్రాలతో వరుస హిట్లను సొంతం చేసుకొని కోలీవుడ్లో టాప్ దర్శకుడిగా పేరొందిన అట్లీ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ కింగ్ఖాన్తో అట్లీ నెక్ట్స్ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
కాగా 2019లో ఐపీఎల్ జరిగిన సమయంలో షారూక్ను కలిశారు అట్లీ. ఆ సమయంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు విజయ్తో అట్లీ చేసిన బిగిల్ మూవీలోనూ షారూక్ విలన్ పాత్ర చేయబోతున్నట్లు టాక్ నడిచింది. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక తాజా సమాచారం ప్రకారం.. షారూక్కు అట్లీ కథను చెప్పడం, ఆయన ఒప్పుకోవడం జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అట్లీ. ఇదిలా ఉంటే ఎన్టీఆర్తో ఓ సినిమా తీయాలనుకుంటున్నానని అట్లీ ఆ మధ్యన ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కోసం కూడా అట్లీ ఓ కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
Read This Story Also: కరోనా బారిన పడ్డ హాలీవుడ్ నటి ఒలివియా..!