షాకింగ్.. చిరు మూవీ నుంచి మరొకరు ఔట్..!

| Edited By:

Apr 03, 2020 | 5:00 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్యకు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇక కొద్ది రోజులు సమయం ఉందనగా.. ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది.

షాకింగ్.. చిరు మూవీ నుంచి మరొకరు ఔట్..!
Follow us on

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఆచార్య’కు షాక్‌ల మీద షాక్‌లు పడుతున్నాయి. షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇక కొద్ది రోజులు సమయం ఉందనగా.. ఈ మూవీ నుంచి త్రిష తప్పుకుంది. క్రియేటివ్‌ ఢిపరెన్స్‌ల కారణంగానే ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. ఇక ఆ స్థానంలో వెంటనే కాజల్‌ను తీసుకొచ్చింది చిత్ర యూనిట్. ఇక ఈ మూవీలో నటించేందుకు కాజల్‌కు భారీగా ముట్టిందనే వార్తలు కూడా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి మరొకరు ఔట్ అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ మూవీకి ప్రముఖ ఎడిటర్‌ శ్రీకర్ ప్రసాద్‌ను తీసుకోగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. మూవీ యూనిట్‌తో గొడవలేమీ లేకపోయినా.. అనుకున్న సమయానికి ఆచార్య షూటింగ్ జరిగేలా లేకపోవడం.. అలాగే ఆచార్య కన్నా ముందు మరికొన్ని సినిమాలు ఒప్పుకోవడం వల్లే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో చర్చించిన తరువాతే శ్రీకర్ ప్రసాద్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక శ్రీకర్ తప్పుకోవడంతో.. మరో టాలెంటెడ్ ఎడిటర్ నవీన్‌ నూలిని ఆచార్య కోసం ఎంపిక చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. కాగా ఈ చిత్రంలో చెర్రీ కీలక పాత్రలో కనిపిస్తుండగా.. సోనూసూద్‌ మరో ముఖ్య పాత్రలో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: ‘మహానటి’ని వద్దంటోన్న మహేష్‌ ఫ్యాన్స్‌.. ఎందుకంటే..!