Uttar Pradesh Assembly Election 2022 Voting Live Updates: ఉత్తర అసెంబ్లీ ఎన్నికల ఐదవ దశ 2022లో, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 61 స్థానాలకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు ఓట్లు వేయనున్నారు. ఈ దశలో సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, కౌశాంబి, ప్రయాగ్రాజ్, బారాబంకి, అయోధ్య, బహ్రైచ్, శ్రావస్తి, గోండా, అమేథీ, రాయ్బరేలీ జిల్లాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఐదో దశ ఎన్నికల్లో 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 693 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 90 మంది మహిళా అభ్యర్థులు. ఈరోజు 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 1.20 కోట్ల మంది పురుషులు, 1.05 కోట్ల మంది మహిళలు మరియు 1727 మంది లింగమార్పిడి ఓటర్లు ఉన్నారు. ఐదవ దశ ఎన్నికలలో మొత్తం 25,995 పోలింగ్ కేంద్రాలు,14030 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.కోవిడ్ -19 దృష్ట్యా, గరిష్ట సంఖ్యలో ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని భారత ఎన్నికల సంఘం సూచనలు ఇవ్వడం జరిగింది.
ఐదో దశలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తన సొంత జిల్లా కౌశాంబిలోని సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, వీరిపై అప్నాదళ్ (కమ్యూనిస్టు) నేత పల్లవి పటేల్ను ఎస్పీ బరిలోకి దింపడం గమనార్హం. ఐదవ దశలో, అయోధ్య నుండి ప్రయాగ్రాజ్ మరియు చిత్రకూట్ వంటి మతపరంగా ముఖ్యమైన ప్రాంతాలలో పోలింగ్ జరుగుతుంది.
అమేథీ రాచరిక రాష్ట్ర మాజీ అధినేత సంజయ్ సింగ్ ఈసారి అమేథీలో బీజేపీ అభ్యర్థిగా, రాష్ట్ర మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్, ప్రతాప్గఢ్ జిల్లా పట్టి, ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ పశ్చిమ అసెంబ్లీ స్థానం ప్రయాగ్రాజ్ జిల్లా, పౌర విమానయాన శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది ఈ జిల్లాలోని దక్షిణ స్థానం నుంచి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రమాపతి శాస్త్రి గోండా జిల్లాలోని మాన్కాపూర్ (రిజర్వ్డ్) నుంచి, రాష్ట్ర మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ చిత్రకూట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
1993 నుంచి ప్రతాప్గఢ్ జిల్లాలోని కుంట నుంచి ఎన్నికల్లో గెలుపొందిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా ఈసారి తన సంప్రదాయ స్థానం నుంచి జనసత్తా పార్టీ టిక్కెట్పై పోటీలో ఉన్నారు. ప్రతాప్గఢ్ జిల్లాలోనే, సమాజ్వాదీ కూటమి అభ్యర్థిగా అప్నా దళ్ (కామరావాడి) అధ్యక్షుడు కృష్ణ పటేల్ బిజెపికి పోటీ ఇస్తున్నారు. కృష్ణ పటేల్ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుప్రియా పటేల్ తల్లి.
అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకురాలు ఆరాధన మిశ్రా ‘మోనా’ కూడా ప్రతాప్గఢ్ జిల్లాలోని తన సాంప్రదాయ రాంపూర్ ఖాస్ స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో నాలుగో విడత పోలింగ్ ముగిసిన తర్వాత 231 స్థానాలకు పోలింగ్ జరగ్గా, ఈరోజు 61 స్థానాలకు పోలింగ్ జరగ్గా 292 స్థానాలకు పోలింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత మార్చి 3, 7 తేదీల్లో చివరి రెండు దశల్లో 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఉత్తరప్రదేశ్లో 5వ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.98% ఓటింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
53.98 % voters turnout recorded till 5 pm in the fifth phase of #UttarPradeshElections2022 pic.twitter.com/uAuuEulrHr
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును ICJకి సమర్పించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణను సమర్థించేందుకు మారణహోమం భావనను తారుమారు చేసినందుకు రష్యా బాధ్యత వహించాలని ఆరోపించింది. ఇప్పుడు సైనిక కార్యకలాపాలను నిలిపివేయమని రష్యాను ఆదేశించాలని మేము తక్షణ నిర్ణయాన్ని అభ్యర్థిస్తున్నాము మరియు తదుపరి వారం విచారణ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాము.
ఉత్తరప్రదేశ్లో 5వ దశ పోలింగ్ కొనసాగుతోంది. ప్రయాగ్రాజ్లో అన్ని పార్టీల పని తీరును పరిశీలించి ఓట్లు వేశామని మహిళా ఓటర్లు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఏ పార్టీ ఏం చేసిందో చూశామని, అన్నింటినీ అవగతం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నామని పేర్కొన్నారు మహిళా ఓటర్లు.
उत्तर प्रदेश: प्रयागराज में विधानसभा चुनाव के 5वें चरण का मतदान जारी है।
एक महिला वोटर ने बताया, “प्रयागराज में लोगों ने सभी पार्टियों के काम को देख कर अपना वोट दिया है। पिछले पांच साल में हमने देखा है कि किस पार्टी ने कितना काम किया है तो हमने उसी आधार पर वोट दिया है।” pic.twitter.com/fSYncLRTah
— ANI_HindiNews (@AHindinews) February 27, 2022
ఉత్తరప్రదేశ్లో 5వ దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.28 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
అయోధ్య జిల్లాలోని మిల్కీపూర్ అసెంబ్లీ-273 బూత్ నంబర్ 104, 105, 106 కుమార్గంజ్లోని బూత్ను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ నేత శంభు సింగ్ ప్రయత్నిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఎస్పీ నేతలు డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 21.39 శాతం ఓటింగ్ జరగగా, ఉదయం 9 గంటల వరకు 8.02 శాతం ఓటింగ్ నమోదైంది. చిత్రకూట్లో అత్యధికంగా 38.99 శాతం ఓటింగ్ నమోదైంది. అయోధ్యలో 38.79 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా ప్రయాగ్రాజ్లో 30.56 శాతం ఓట్లు పోలయ్యాయి. జిల్లాల వారీగా, ఓటింగ్ శాతాన్ని తెలుసుకోండి.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन 2022
पांचवें चरण के अंतर्गत 12 जनपदों में अपराह्न 01 बजे तक कुल औसतन मतदान 34.83% रहा।#ECI#AssemblyElections2022 #GoVote #GoVoteUP_Phase5 pic.twitter.com/cUChZAXpR1
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 27, 2022
ఉత్తరప్రదేశ్లో ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో అవధ్, పూర్వాంచల్లోని 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 34.83 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन 2022
पांचवें चरण के अंतर्गत 12 जनपदों में अपराह्न 01 बजे तक कुल औसतन मतदान 34.83% रहा।#ECI#AssemblyElections2022 #GoVote #GoVoteUP_Phase5 pic.twitter.com/cUChZAXpR1
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 27, 2022
యూపీలో ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరుతున్నారు.
जनपद श्रावस्ती में पूर्वांह 11 बजे तक मतदान प्रतिशत 23.18 रहा @ECISVEEP @ceoup @InfoDeptUP @InfoUPFactCheck @SpokespersonECI pic.twitter.com/mzS5ZZhkXU
— DM Shravasti (@dmshravasti) February 27, 2022
ఉత్తరప్రదేశ్లో ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో అవధ్, పూర్వాంచల్లోని 12 జిల్లాల్లోని 61 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 21.39 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు ఉదయం 9 గంటల వరకు 8.02 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్రకూట్లో 25.59 శాతం ఓటింగ్ నమోదైంది. అయోధ్యలో 24.61 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బారాబంకిలో 18.67 శాతం ఓట్లు పోలయ్యాయి.
उत्तर प्रदेश विधानसभा सामान्य निर्वाचन 2022
पांचवें चरण के अंतर्गत 12 जनपदों में पूर्वाह्न 11 बजे तक कुल औसतन मतदान 21.39% रहा।#ECI#AssemblyElections2022 #GoVote #GoVoteUP_Phase5 pic.twitter.com/09E6uJIHVq
— CEO UP #DeshKaMahaTyohar (@ceoup) February 27, 2022
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది ఐదవ దశ ఎన్నికల సందర్భంగా ప్రయాగ్రాజ్, బారాబంకి, సుల్తాన్పూర్లోని వివిధ పోలింగ్ స్టేషన్లలో వికలాంగులు, వృద్ధ ఓటర్లకు సాయం చేస్తున్నారు.
उत्तर प्रदेश विधानसभा चुनाव के पांचवें चरण के दौरान भारत-तिब्बत सीमा पुलिस (ITBP) के जवान प्रयागराज, बाराबंकी और सुल्तानपुर के विभिन्न मतदान केंद्रों पर विकलांग और बुजुर्ग मतदाताओं की सहायता कर रहे हैं। #UttarPradeshElections pic.twitter.com/VlVokmkCyO
— ANI_HindiNews (@AHindinews) February 27, 2022
కొన్ని చోట్ల ఈవీఎంలలో లోపం ఉన్నట్లు నివేదికలు మినహా అన్ని చోట్ల ఇప్పటివరకు ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి BD రామ్ తివారీ పేర్కొన్నారు. అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నామని తెలిపారు.
8.02% voter turnout recorded from 7- 9 am in the fifth phase for 5th phase #UPElections2022. Voting being done peacefully at all places, barring reports of glitch in EVMs at some places. Necessary action being taken: Additional Chief Electoral Officer, BD Ram Tiwari, Lucknow pic.twitter.com/lRWXB8siQF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్రాజ్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఆయన సీరత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాపు 300లకు పైగా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
Uttar Pradesh Deputy CM Keshav Prasad Maurya casts his vote at a polling booth in Prayagraj. He is contesting from Sirathu.
“I appeal to the people to vote in as many numbers as possible. We will secure 300+ seats and form govt.” he says pic.twitter.com/NDU9qu5TAo
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ఉత్తరప్రదేశ్ ఐదో విడత ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 8.02 శాతం ఓటింగ్ నమోదైంది.
8.02% voters turnout recorded till 9 am in the fifth phase of #UttarPradeshElections pic.twitter.com/RRZoGPWOyN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ప్రయాగరాజ్ BJP MP రీటా బహుగుణ జోషి ఓటు హక్కు నినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 300లకు పైగా సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
BJP MP from Prayagaraj Rita Bahuguna Joshi casts her vote in th 5th phase of #UPElection2022, says, “We are expecting 70% voters’ turnout (in this phase), will win it big. Hoping to form govt with 300+ seats.” pic.twitter.com/YoCXOjqfX4
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
బీజేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ అమేథీలోని పోలింగ్ బూత్లో తన భార్యతో కలిసి ఓటు వేశారు. అయితే ముందుగా పంచమ్ ధోబీ దంపతులు ఓటు వేశారు.
యూపీలోని 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాల్లో ఐదో దశలో ఓటింగ్ కొనసాగుతోంది. సర్వజన సర్కారు కోసం ఈ ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని.. మయావతి కోరారు.
1. यूपी के 12 ज़िलों की 61 विधानसभा सीटों पर आज पाँचवें चरण में भी ’हर पोलिंग बूथ को जिताना है, बीएसपी को सत्ता में लाना है’ की प्रतिज्ञा व ज़िद के साथ वोटिंग करते रहना ज़रूरी, ताकि द्वेष, पक्षपात, उन्माद व तानाशाही आदि से मुक्त यहाँ सर्वजन हिताय व सर्वजन सुखाय की सरकार बन सके।
— Mayawati (@Mayawati) February 27, 2022
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) నాయకురాలు, రాంపూర్ ఖాస్ అభ్యర్థి ఆరాధన మిశ్రా సంగ్రామ్ఘర్లోని పోలింగ్ స్టేషన్లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశం, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అంటూ ఆమె కోరారు.
Pratapgarh, UP | Congress Legislature Party (CLP) leader & party’s candidate from Rampur Khas, Aradhana Misra casts her vote at a polling station in Sangramgarh
She says, “Biggest power in a democracy is your vote. Vote for the country & your own future”#UttarPradeshElections pic.twitter.com/c46cjALROK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ఐదవ దశ పోలింగ్ మధ్య రాష్ట్ర మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్ ప్రయాగ్రాజ్లోని ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. 2017కి ముందు అభివృద్ధి, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గాడిలో పెట్టామని తెలిపారు.
Prayagraj | UP minister Sidharth Nath Singh & his family offer prayers at Sai Baba Mandir in Prayagraj as voting in the fifth phase of #UttarPradeshElections gets underway
Singh is contesting as BJP candidate from Allahabad West constituency, polling on which is being held today pic.twitter.com/Plj0dRl7XU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ఓటు వేసే ముందు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఇంట్లో పూజలు చేశారు. ఆయన సిరతు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు.
Kaushambi, UP | Deputy CM Keshav Prasad Maurya offers prayers at his residence as voting in the fifth phase of #UttarPradeshElections gets underway.
Maurya is contesting as a BJP candidate from Sirathu constituency, polling on which is being held today. pic.twitter.com/sqOgTzZ1Kh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 27, 2022
ఉత్తరప్రదేశ్లో ఐదో విడత పోలింగ్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటువేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
उत्तर प्रदेश में लोकतंत्र के उत्सव का आज पांचवां चरण है। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे अपने मताधिकार का प्रयोग करें और अपना कीमती वोट अवश्य दें।
— Narendra Modi (@narendramodi) February 27, 2022
ఈ విడతలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తన సొంత జిల్లా కౌశాంబిలోని సిరతు అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరికి వ్యతిరేకంగా సమాజ్వాదీ పార్టీ అప్నాదళ్ (కమ్యూనిస్ట్) నాయకురాలు పల్లవి పటేల్ను రంగంలోకి దించింది. కాగా పల్లవి పటేల్ సోదరి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి అనుప్రియా పటేల్ కేశవ్ ప్రసాద్ మౌర్యకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. అనుప్రియా పటేల్ తల్లి కృష్ణ పటేల్ ప్రతాప్గఢ్ సదర్ నుంచి సమాజ్వాదీ కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. మరోవైపు, 1993 నుంచి ప్రతాప్గఢ్ జిల్లాలోని కుంట నుంచి ఎన్నికల్లో గెలుపొందిన రఘురాజ్ ప్రతాప్ సింగ్ ఈసారి ఆయన ఏర్పాటు చేసిన జనసత్తా పార్టీ నుంచి బరిలో ఉన్నారు.
శ్రీ రాముడి నగరమైన అయోధ్యలో కూడా ఈరోజు ఓటింగ్ జరగుతోంది. బీజేపీకి ఈ సారి సవాల్గా మారుతుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుం
ఉత్తరప్రదేశ్లో ఈ రోజు ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో అవధ్, పూర్వాంచల్లోని 12 జిల్లాల్లోని 61 సీట్లు ఉన్నాయి. అమేథీ, సుల్తాన్పూర్, చిత్రకూట్, ప్రతాప్గఢ్, రాయ్ బరేలీ, కౌశాంబి, ప్రయాగ్రాజ్, బారాబంకి, అయోధ్య, బహ్రైచ్, శ్రావస్తి, గోండా జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.