Punjab Elections: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో అపర కుబేరులు 41శాతం.. 25శాతం మందికి నేరచరిత్ర!

|

Feb 12, 2022 | 8:12 AM

Punjab Assembly Election 2022: ఎన్నికలంటే డబ్బు..డబ్బుంటేనే ఎన్నికలన్న చందంగా మారింది పరిస్థితి. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా అదే చెబుతోంది. బరిలోకి దిగిన వారిలో 41 శాతం కోటీశ్వరులేనంటోంది ఓ సర్వే..

Punjab Elections: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో అపర కుబేరులు 41శాతం.. 25శాతం మందికి నేరచరిత్ర!
Punjab Rich Politicians
Follow us on

Punjab rich politicians: ఎన్నికలంటే డబ్బు..డబ్బుంటేనే ఎన్నికలన్న చందంగా మారింది పరిస్థితి. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల(Punjab Assembly Election 2022) అభ్యర్థుల జాబితా అదే చెబుతోంది. బరిలోకి దిగిన వారిలో 41 శాతం కోటీశ్వరులేనంటోంది ఓ సర్వే.. పంజాబ్‌లోని అత్యంత సంపన్న అభ్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), శిరోమణి అకాలీదళ్ (SAD), కాంగ్రెస్‌(Congress)ల నుండి ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నారు. పంజాబ్‌ ఎన్నికల బరిలో ఉన్న 10 మంది ధనవంతుల జాబితాను వెల్లడించింది. మొత్తం 117 స్థానాలకు అభ్యర్థులందరూ ఎన్నికల అధికారులకు తమ నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌ల ప్రకారం, 10 మంది అత్యంత ధనవంతులైన అభ్యర్థులలో బీజెపీకి చెందిన ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు.

సహజంగా ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్నవి. డబ్బులేనివారు ఎన్నికల బరిలో నిలవడానికి వెనుకాడడం ఖాయం. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల జాబితాను చూస్తే అదే అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1304 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 1276 మంది ఎన్నికల అఫిడవిట్‌ను అధ్యయనం చేసిన ఏడీఆర్‌ ఓ నివేదిక రూపొందించింది. పంజాబ్‌ ఎన్నికల్లో జాతీయ పార్టీల నుంచి 228 మంది, ప్రాంతీయ పార్టీల నుంచి 256 మంది పోటీ చేస్తున్నారు. 447 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మిగతా వారు గుర్తింపు లేని పార్టీల నుంచి పోటీ చేస్తున్నట్లు చెబుతోంది ఏడీఆర్‌ నివేదిక. వీరిలో 41 శాతం మంది కోటీశ్వరులే ఉన్నట్లు తెలిపింది.

సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్ (మొహాలీ) నుండి AAP అభ్యర్థి కుల్వంత్ సింగ్, పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి మెట్రిక్యులేట్, రియాల్టీ బ్యారన్ అయిన అతను ఐదు సంవత్సరాల క్రితం మొహాలీకి మొదటి మేయర్. ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రాజకీయవేత్తగా మారిన వ్యాపారవేత్త, కుల్వంత్ సింగ్ తన ఆస్తుల విలువ రూ. 238 కోట్లుగా ప్రకటించారు. అతని భార్యతో కలిసి రూ. 203.88 కోట్ల చరాస్తులు ఉన్నట్లు సూచించారు. ఎక్కువగా తన జంతా ల్యాండ్ ప్రమోటర్స్ లిమిటెడ్ (జెఎల్‌పిఎల్)లో పెట్టుబడులు పెట్టారు. 10 మంది సంపన్న అభ్యర్థుల జాబితాలో తదుపరిది SAD అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్, జలాలాబాద్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య భటిండా నుండి MP అయిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌తో కలిసి రూ.202.64 కోట్లు ఆస్తులను ప్రకటించారు.

పట్టి నుండి ఎస్‌ఎడి అభ్యర్థి సుఖ్‌బీర్ బావ ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్ రూ. 83.12 కోట్ల ఆస్తులను ప్రకటించగా, బటిండా (పట్టణ) స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుఖ్‌బీర్ బంధువు, ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ రూ.72.70 కోట్ల ఆస్తులను ప్రకటించారు. 2012లో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి హర్చరణ్ సింగ్ బ్రార్ కోడలు అయిన ముక్త్సర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ కౌర్ బ్రార్ ఈసారి రూ.135.4 కోట్ల ఆస్తులను ప్రకటించారు. కేబినెట్ మంత్రి రాణా గుర్జీత్ సింగ్, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన కపుర్తలా నుండి కాంగ్రెస్ అభ్యర్థి రూ. 125.66 కోట్లు, సుల్తాన్‌పూర్ లోధి స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతని కుమారుడు రాణా ఇంద్ర ప్రతాప్ సింగ్ రూ. 70 కోట్ల ఆస్తులతో 10 మంది ధనవంతులలో ఉన్నారు. ఖరార్ నుంచి పోటీ చేస్తున్న మూడో ఎస్ఏడీ అభ్యర్థి రంజిత్ సింగ్ గిల్ ఆస్తుల విలువ రూ.74 కోట్లు. అలాగే, 87.74 కోట్ల ఆస్తులతో అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో ఆప్ రెండో అభ్యర్థి అమన్ కుమార్ అరోరా. ఆయన సునం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జలంధర్ కంట్లో బీజేపీ అభ్యర్థి సరబ్జిత్ సింగ్ మక్కర్ ఆస్తుల విలువ రూ.73.55 కోట్లు.

అత్యధికంగా కాంగ్రెస్‌కు చెందిన 107 మంది కోటీశ్వరులు ఉండగా.. శిరోమణి అకాలీదళ్‌ నుంచి 89 మంది, ఆప్‌ నుంచి 81, బీజేపీ నుంచి 60 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నారు. వారు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆస్తుల అఫిడవిట్‌ ఆధారంగా నివేదిక రూపొందించింది ఏడీఆర్‌. అంతేనా..బరిలో నిలిచిన 1304 మంది అభ్యర్థుల్లో 25శాతం మందికి నేర చరిత్ర ఉందని వెల్లడించింది ఏడీఆర్‌ నివేదిక. 57 నియోజకవర్గాల్లో ముగ్గురికంటే ఎక్కువ మంది నేరాభియోగాలు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. ఇందులో 218 మందిపై సివియర్‌ క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 15 మంది మహిళలపై నేరాలు చేయగా.. నలుగురు హత్య కేసులో, 33 మంది హత్యాయత్నం కేసుల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది ఏడీఆర్‌.

Read Also….  Earthquake: ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు.. భయంతో జనం పరుగులు