UK New Coronavirus Strain: : లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణీకుల్లో ఐదుగురుకి కరోనా పాజిటివ్
సోమవారం రాత్రి లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న విమానంలో 266 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఐదుగురు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారించబడ్డారు.
సోమవారం రాత్రి లండన్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న విమానంలో 266 మంది ప్రయాణికులు, సిబ్బందికి ఆర్టీ పిసిఆర్ టెస్టులు చేయగా ఐదుగురు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వారి నమూనాలను పరిశోధన కోసం ఎన్సిడిసి(నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్)కి పంపారు. ఆపై వెంటనే వారికి కోవిడ్ కేర్ సెంటర్కు తరలించారు. కోవిడ్-19 నోడల్ అధికారి ఏఎన్ఐకి ఈ వివరాలు తెలిపారు.