ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వే షెడ్‌లో అగ్ని ప్రమాదం

దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇదే సమయంలో నిత్యం ఎక్కడో..

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వే షెడ్‌లో అగ్ని ప్రమాదం
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 12:21 PM

దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇదే సమయంలో నిత్యం ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్‌ రైల్వే యార్డులోని ఓ షెడ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే అక్కడి సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.