Gang Rape: కదులుతున్న కారులో తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్ ఇచ్చి అఘాయిత్యం..

|

Jun 27, 2022 | 11:44 AM

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.. హరిద్వార్‌లోని రూర్కీలో మహిళ, ఆరేళ్ల ఆమె కుమార్తెపై కారులో కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gang Rape: కదులుతున్న కారులో తల్లీ, ఆరేళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్ ఇచ్చి అఘాయిత్యం..
Representational Image
Follow us on

Gang Rape in Uttarakhand: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. కామాంధులు రెచ్చిపోతున్నారు. రోజురోజుకి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.. హరిద్వార్‌లోని రూర్కీలో మహిళ, ఆరేళ్ల ఆమె కుమార్తెపై కారులో కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రాత్రి సమయంలో పిరాన్ కలియార్ నుంచి ఇంటికి వెళుతుండగా సోను అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. ఆతర్వాత అతను, అతని స్నేహితులు మహిళ, కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు.

ఆమె కారులోకి ఎక్కే సమయానికే ఆ వ్యక్తి స్నేహితులు కొందరు కారులో ఉన్నట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (రూరల్) ప్రమేంద్ర దోవల్ తెలిపారు. ఆమెను కారులోకి ఎక్కిన తరువాత సోను, అతని స్నేహితులు కదులుతున్న కారులోనే వారిద్దరిపై అత్యాచారం చేసి అనంతరం కాలువ దగ్గర పడేశారు. అనంతరం అర్థరాత్రి మహిళ ఎలాగోలా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పిందని తెలిపారు.

కారులో ఎంత మంది పురుషులు ఉన్నారో మహిళ సరిగ్గా చెప్పలేకపోతుందని.. దానిని నడుపుతున్న వ్యక్తి పేరు సోను అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాధితులిద్దరినీ రూర్కీ సివిల్ హాస్పిటల్‌లో చేర్పించామని, వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంకా వారి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..