షాకింగ్ న్యూస్: కన్న కూతుర్నే నరబలి ఇచ్చిన దుర్మార్గపు తండ్రి

| Edited By:

Jun 02, 2020 | 1:33 PM

ఆకతాయిలు, అల్లరిమూకల నుంచి బిడ్డను రక్షించుకునే తండ్రులను చూసి ఉంటాం. అనుకోని ఆపద వస్తే కడుపులో పెట్టుకుని మరీ కాపాడేది తండ్రే. కానీ అలాంటిదే.. ఓ దుర్మార్గపు తండ్రి తన సొంత కూతుర్ని నరబలి ఇచ్చాడు. ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో...

షాకింగ్ న్యూస్: కన్న కూతుర్నే నరబలి ఇచ్చిన దుర్మార్గపు తండ్రి
Follow us on

Shocking News: ఆకతాయిలు, అల్లరిమూకల నుంచి బిడ్డను రక్షించుకునే తండ్రులను చూసి ఉంటాం. అనుకోని ఆపద వస్తే కడుపులో పెట్టుకుని మరీ కాపాడేది తండ్రే. కానీ.. ఓ దుర్మార్గపు తండ్రి మాత్రం తన కన్న కూతుర్ని నరబలి ఇచ్చాడు. ఈ దారుణమైన ఘటన తమిళనాడు పుదుకొట్టై జిల్లాలోని గంధర్వకోటలో చోటుచేసుకుంది. మూఢనమ్మకంతో తన కన్న కూతుర్నే బలి ఇచ్చాడు తండ్రి పన్నీర్ సెల్వం.

గంధర్వ కోటకు చెందిన 13 ఏళ్ల అమ్మాయి అనుమానస్పదంగా మృతి చెందింది. అయితే తనకేం తెలియనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి పన్నీర్ సెల్వం. కూతురిపై ఎవరో అత్యాచారం చేసి హత్య చేశారంటూ మొదట ఫిర్యాదులో పేర్కొన్నాడు నిందితుడు పన్నీర్ సెల్వం. అయితే అత్యాచారం జరగలేదని తేలడంతో తండ్రి పన్నీర్ సెల్వంను అనుమానించారు పోలీసులు. దీంతో ఖాకీలు తనదైన స్టైల్లో విచారించడంతో.. అసలు నిజం బయట పెట్టాడు ఆ నిందితుడు. తానే నరబలి ఇచ్చేందకు.. కూతర్ని చంపినట్టు చెప్పుకొచ్చాడు. ఓ మాంత్రికుడి చెప్పిన విధంగా సొంత కూతుర్నే చంపినట్టు నిజం బయటపెట్టాడు పన్నీర్ సెల్వం. దీంతో పన్నీర్‌సెల్వంపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి:

ప్రముఖ రచయిత జొన్న విత్తులపై ఎస్సీ, ఎస్టీ కేసు..

బ్రేకింగ్: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా

సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి అడ్డుతగిలిన యువకుడు

మళ్లీ ఎబోలా కలకలం.. నలుగురు మృతి