Shadnagar Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగం.. కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలను బలితీసుంది. ఈ సంఘటన షాద్నగర్ బైపాస్ సమీపంలోని వై జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వై జంక్షన్ వద్ద వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. హైదరాబాద్ నుంచి ముగ్గురు యువకులు కర్నూల్కు వెళుతున్నారు. ఈ క్రమంలో అన్నారం బైపాస్ వై జంక్షన్ సమీపంలో వేగంగా వచ్చిన కారు.. అదుపుతప్పి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి.. అనంతరం రోడ్డుకు అవతలవైపు వస్తున్న లారీని లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల ద్వారా ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: