Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. రోజూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై లారీ కారును ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన దానిపై విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.