పిల్లల్లో కొత్తరకమైన కోవిడ్ వైరస్ రావడంతో.. అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పిడియాట్రిక్ మల్టీ-సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్.. అనే కొత్త రకమైన రోగంతో పెద్ద ఎత్తున కొత్త కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పిల్లల్లోనే కనిపించడం విశేషం. దీన్నే కవాసాకీ వ్యాధి లేదా టాక్సి షాక్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తూంటారని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. ఈ రకమైన వ్యాధి ఈ మధ్య న్యూయార్క్లోకి పిల్లలకు తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ రకమైన కరోనా సోకి.. పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే దాదాపు 100 మంది పిల్లలకు ఈ వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు మంది ఈ వ్యాధితో మృతి చెందారు. బుధవారం తొలిసారిగా ఐదేళ్ల పిల్లాడు న్యూయార్క్లో చనిపోయాడు. కాగా కొంత మంది పిల్లల్లో ఈ రకమైన కరోనా సోకిన 6 వారాల తర్వాత వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని న్యూయార్క్ మేయర్ ప్రజలను కోరారు.
పిల్లల్లో కనిపించే కొత్త సిండ్రోమ్ లక్షణాలు:
– ముందుగా జ్వరం వస్తుంది
– నీరసం రావడం
– ఆకలి వేయకపోవడం
– దురదలు రావడం
– పెదవులు మరింత ఎర్రగా మారిపోవడం
– నోరు కూడా ఎర్రగా మారడం
– కొంత మంది పిల్లలు స్కిన్ కలర్ మారడం
– పొట్టలో నొప్పి రావడం
– వికారంగా ఉండి వాంతులు రావడం
ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లల్ని ఎంత త్వరగా ఆస్పత్రికి తీసుకొస్తే.. అంత మంచిదంటున్నారు డాక్టర్లు. ఇలాంటి పరిస్థితి వారం కిందటి వరకూ లేదనీ.. ఇప్పుడు అమెరికా మొత్తం ఈ కొత్త కేసులు నమోదవుతాయని అంటున్నారు వైద్యులు.
Dear Families, Please read the attached letter, it contains information about the Pediatric Multi-System Inflammatory Syndrome (PMIS). PMIS is new health condition that is appearing in children in NYC and may be associated with COVID-19. Please be aware of the symptoms. pic.twitter.com/yu2KNKfGVt
— P.S. 119 (@PS119x) May 11, 2020
Read More:
బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్ఆర్టీసీలో కొత్త మోడల్
రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్