మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌

| Edited By:

Aug 12, 2020 | 8:32 PM

కరోనా మహమ్మారి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా కేంద్ర మంత్రులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కూడా కరోనా సోకిన..

మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్‌
Follow us on

కరోనా మహమ్మారి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా కేంద్ర మంత్రులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా.. బుధవారం నాడు కేంద్ర ఆయుష్‌ మంత్రి శ్రీ పాద యశోనాయక్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. “బుధవారం నాడు కరోనా పరీక్షలు చేయించుకోగా.. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నాతో పలు కార్యక్రమాల్లో వేదికను పంచుకున్న వారితో పాటు.. నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి” అంటూ కేంద్ర మంత్రి శ్రీపాద కోరారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే