కజికిస్తాన్ రిపబ్లిక్లో చిక్కుబడిన సుమారు ఐదు వందల మంది భారతీయుల విద్యార్థులు.. తమ స్వదేశానికి పంపాలని కోరుతున్నారు. వీరిలో రెండు వందల మంది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారున్నారు. స్వదేశానికి పంపేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మాగతి ఏమౌతుందో తెలియదని.. హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి వాపోయాడు. మార్చ్ 20న వీరు కజిస్తాన్లో ఆల్మటీ చేరుకున్నారు. అయితే ఇండియాకి తిరిగి వద్దామంటే లాక్డౌన్ ప్రకటించకముందే అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీంతో వారం రోజుల పాటు వారు ఆల్మటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులోనే గడిపారు. అయితే డబ్బులు అయిపోవడంతో.. లాక్డౌన్ ప్రకటించడంతో వారు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. కనీసం ఆహారం కూడా లభించలేదు. ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి కజికిస్తాన్లోనే తమ సహచరుల విద్యార్థుల బాధలను ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసుకుంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఉత్తర్వులపై కజికిస్తాన్లోని ఇండియన్ ఎంబసీ నోడల్ ఆఫీసర్ను నియమించి వారికి వసతి, ఇతర సౌకర్యాలను కల్పించింది. ఏది ఏమైనా ఈ నెల 15 తరువాత వీరిని స్వదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Read More:
బ్రేకింగ్ న్యూస్: ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ కీలక ప్రసంగం
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. టెన్త్ విద్యార్థులకు వాట్సాప్ లెసన్స్
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం