24 గంట‌ల్లో మ‌రో 67 కేసులు..ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

|

May 04, 2020 | 1:41 PM

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య

24 గంట‌ల్లో మ‌రో 67 కేసులు..ఏపీలో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి
Follow us on
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటలలో కొత్తగా 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1650కి చేరింది.  కర్నూలులో అత్యధికంగా గత 24 గంటల్లో పాతిక కేసులు నమోదయ్యాయి.దీంతో ఈ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 491కి చేరింది.
ఏపీలో కరోనా రోజురోజుకు ప్రమాదకరంగా మారుతూనే ఉంది. రోజుకు కనీసం 60 నుంచి 70 కేసులకు తగ్గకుండా కొత్త పాజిటివ్ కేసులు నమోద‌వుతూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమ‌వారం వరకు.. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 67 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,292 సాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కరోనా వచ్చినట్లు తేలింది. చిత్తూరులో 1, గుంటూరులో 19, కడపలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1650కి చేరింది. అటు.. 524 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1093 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.