ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,70,562కి చేరింది. ఇందులో 5,259 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,58, 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
వైరస్ కారణంగా ముగ్గురు మృతి చెందారు. ఇక నిన్న 785 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,05,70,843 సాంపిల్స్ను పరీక్షించారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 50, చిత్తూరు 76, తూర్పుగోదావరి 49, గుంటూరు 92, కడప 23, కృష్ణా 121, కర్నూలు 14, నెల్లూరు 29, ప్రకాశం 17, శ్రీకాకుళం 22, విశాఖపట్నం 44, విజయనగరం 15, పశ్చిమ గోదావరి 66 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.