Coronavirus updates in Telangana: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 185 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,924కి చేరింది. నిన్న ఒక్కరోజే ఇద్దరు కొవిడ్ కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,604కి పెరిగింది. కాగా… 24 గంటల వ్యవధిలో 197 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,91,312కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,008 కాగా, వారిలో 730 హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 27 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read: INDIA VS ENGLAND: ఇంగ్లండ్ను తిప్పేద్దాం… ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించనున్న టీమిండియా…