మర్కజ్‌ మీటింగ్‌కి హాజరైన వ్యక్తి.. చికిత్సపొందుతూ ఆత్మహత్యాయత్నం..

| Edited By:

Apr 02, 2020 | 12:51 PM

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ వ్యవహారం గురించి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకున్న వేళ.. మర్కజ్‌ మీటింగ్ వ్యవహారంతో తలకిందులైంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసులు నమోదైన వాటిలో ఎక్కువశాతం ఈ సమావేశాలకు హాజరైన వారివే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాలకు హాజరైన వారిని పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో ఉంచి కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కూడా […]

మర్కజ్‌ మీటింగ్‌కి హాజరైన వ్యక్తి.. చికిత్సపొందుతూ ఆత్మహత్యాయత్నం..
Follow us on

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీలోని నిజాముద్దీన్ వ్యవహారం గురించి తెలిసిందే. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకున్న వేళ.. మర్కజ్‌ మీటింగ్ వ్యవహారంతో తలకిందులైంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసులు నమోదైన వాటిలో ఎక్కువశాతం ఈ సమావేశాలకు హాజరైన వారివే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాలకు హాజరైన వారిని పలు రాష్ట్రాల్లో క్వారంటైన్‌లో ఉంచి కరోనా వైరస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కూడా కొందరు చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలోని 6వ అంతస్తు నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని అడ్డుకుని కాపాడారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపాయి.